కరోనాతో విజయవాడని వణికించిన వ్యక్తి ఇతనే: వీడియో చూడండి

Tuesday, March 24, 2020 07:46 PM News
కరోనాతో విజయవాడని వణికించిన వ్యక్తి ఇతనే: వీడియో చూడండి

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు చేరాయి. శనివారం ఒక్కరోజే రెండు కేసులు నమోదయ్యాయి. విజయవాడలో ఒకటి కాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ బాధితుడు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసి తన బాధను చెప్పుకొచ్చాడు. తన కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

వీడియోలో, తాను పారిస్ నుంచి ఈ నెల 16న ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నానని. అక్కడ స్క్రీనింగ్ చేసి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో కనెక్టింగ్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చానని చెప్పాడు. ఈ 17న ప్రైవేట్ క్యాబ్ తీసుకుని ఒక్కడినే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. పారిస్ నుంచి వచ్చానని తెలియడంతో మున్సిపల్ విజిలెన్స్ సిబ్బంది తన ఇంటికి వచ్చి క్వారంటైన్‌లో ఉండమని చెప్పారన్నాడు. తానూ అధికారుల మాటల్ని గౌరవించి ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్లలేదన్నాడు యువకుడు. లక్షణాలు కనపడితే సమాచారం అందించమని వారు చెప్పారని. తర్వాత జ్వరం రావడంతో వారికి సమాచారం ఇచ్చానన్నాడు. పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చిందని. తనను ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని. లేనిపోని సమాచారంతో తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దన్నాడు.
ఇటు నగరంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది.పాజిటివ్ కేసు నమోదు కావడంతో సంబంధిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి పాజిటివ్ కేసు బాధితుడి ప్రాంతంలో పలువురికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: