ఒక దేశం ఒకే మద్యం ధరలు... తెరపైకి కొత్త డిమాండ్
Friday, December 20, 2024 04:18 PM News

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ ఓ ఐఆర్ఎఎస్ అధికారి ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్టు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓకే సారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయానికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటులో వన్-నేషన్ వన్-ఎలక్షన్ అనే బిల్లును తీసుకొచ్చేందుకు సిద్దమైంది.
అయితే మందు బాబులు ఇదే లాజిక్ తీసుకుని వన్-నేషన్ వన్ రేట్ అంటున్నారని ఓ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గోవాలో రూ.320 లు ఉన్న వైన్ బాటిల్ ధర కర్ణాటకలో రూ.920 లుగా ఉంది. మద్యం ప్రియుల నుంచి ఇటువంటి డిమాండ్ వస్తోంది. దయచేసి దీని గురించి కూడా ఆలోచించండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: