మోడీ సంచలన పిలుపు: ఆదివారం రాత్రి 9 గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు

Friday, April 3, 2020 09:39 AM News
మోడీ సంచలన పిలుపు: ఆదివారం రాత్రి 9 గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు

ప్రాణాంతక కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పారు దేశవ్యాప్తంగా విద్యుత్ దీపాలను ఆర్పి వేయాలని సూచించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరు కొవ్వుత్తులు, దీపాలను వెలిగించాలని విజ్ఙప్తి చేశారు. తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి, దీపాలను వెలిగించాలని చెప్పారు.

దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లతో ప్రతి ఇంటి గుమ్మం వెలిగిపోవాలని అన్నారు. 130 కోట్ల మంది ప్రజలు ఒకేసారి ఈ పని చేయాలని కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి, తోటి వ్యక్తే నైతిక మద్దతు పలుకుతున్నామనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: