యజమాని కోసం ప్రాణాలు వదిలిన శునకం, కన్నీరుమున్నీరైన కుటుంబం..

Monday, April 13, 2020 10:24 AM News
యజమాని కోసం ప్రాణాలు వదిలిన శునకం, కన్నీరుమున్నీరైన కుటుంబం..

శునకం అంటేనే విశ్వాసానికి మారు పేరుగా మనం పరిగణిస్తాం. చాలామంది పెంపుడు శునకాలతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. అవి కూడా వారి పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. రాత్రిపూట ఇంటి గేటు వద్ద ఏ చిన్న అలికిడి అయిన వెంటనే యజమానిని అప్రమత్తం చేస్తాయి. ఒకవేళ రాత్రి వేళ యజమాని బయటకి వెళాల్సివచ్చిన పెంపుడు శునకం కూడా వెంటే బయలుదేరుతుంది. దారి పొడవునా వీధి కుక్కలను నిలువరిస్తూ తిరిగి ఇల్లు చేరేదాక యజమానికి ఏ ఆపద రాకుండా చూసుకుంటుంది.

వివరాలలోకి వెళితే యజమానికి కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోపాలకుంటకు చెందిన కిశోర్ అనే వ్యక్తి  చాలాకాలంగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. శునకాన్ని కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా చూసుకునేవాడు. అలాంటి శునకం శనివారం రాత్రి పాము కాటుకు బలైపోయింది. యజమాని ప్రాణాలను రక్షించేందుకు పాముతో చివరిదాకా పోరాడిన ఆ శునకం చివరకు ప్రాణాలు వదిలింది. శనివారం సాయంత్రం కిశోర్ తన ఇంటిలోని వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. అదే సమయంలో ఓ తాచు పాము అతని మంచం కిందకు దూరడాన్ని పెంపుడు శునకం గమనించింది. వెంటనే కిశోర్ గదిలోకి వచ్చి గట్టిగా అరవడంతో నిద్ర లేచిన కిశోర్ మంచం కింద పామును చూసి షాక్ తిన్నాడు. యజమానిని రక్షించేందుకు ఆ పామును శునకం నోట కరిచి బయటకు లాక్కెళ్లింది. అనంతరం కిశోర్ ఓ కర్రతో పామును కొట్టి చంపాడు. అయితే శునకం పామును నోట కరిచిన సమయంలోనే అది దాన్ని కాటువేసింది. ఆ కాటుకి శునకం బలి అయింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: