ఐటీలో పని చేసే ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..

Wednesday, April 29, 2020 07:27 AM News
ఐటీలో పని చేసే ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..

ఐటీ కంపెనీలతోపాటుగా బీపీవో సంస్థల్లో  పనిచేసే ఉద్యోగులకు జూలై 31 వరకు ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కల్పించింది. కొవిడ్‌-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ మంగళవారం రాష్ర్టాల ఐటీ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. వర్క్‌ ఫ్రం హోంకు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన అనుమతి ఈ నెల 30వ తేదీతో ముగియాల్సి ఉన్నది. 

కానీ ఐటీ, బీపీవో కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ అనుమతిని జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు రవిశంకర్‌ప్రసాద్‌ తెలిపారు. తమ ఉద్యోగులను, సిబ్బందిని దశలవారీగా మళ్లీ కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్న ఐటీ, బీపీవో సంస్థలకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని ‘నాస్కామ్‌' పేర్కొన్నది.

For All Tech Queries Please Click Here..!
Topics: