కరోనా బ్రేకింగ్: గత 24 గంటల్లో ఇండియాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.

Saturday, May 23, 2020 07:38 AM News
కరోనా బ్రేకింగ్: గత 24 గంటల్లో ఇండియాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,570 కొత్త కేసులు నమోదయ్యాయని , 142 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,794 కాగా మరణాల సంఖ్య 3,726 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

కరోనా కోరల్లో చిక్కుకున్న టాప్ 5 రాష్ట్రాలు.

మహారాష్ట్ర :44,582

తమిళనాడు : 14,753

గుజరాత్: 13,273

ఢిల్లీ :12,319

రాజస్థాన్ :6,494.

తెలుగు రాష్ట్రాలలో కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్: 2,667

తెలంగాణ: 1,761


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: