కరోనా బ్రేకింగ్: 24 గంటల్లో 6,029 కొత్త కేసులు, 148 మంది మృతి

Friday, May 22, 2020 08:09 AM News
కరోనా బ్రేకింగ్: 24 గంటల్లో 6,029 కొత్త కేసులు, 148 మంది మృతి

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6029 కొత్త కేసులు నమోదయ్యాయని , 148 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,226 కాగా మరణాల సంఖ్య 3,584 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.

కరోనా కోరల్లో చిక్కుకున్న టాప్ 5 రాష్ట్రాలు.

మహారాష్ట్ర :41,642

తమిళనాడు : 13,967

గుజరాత్: 12,910

ఢిల్లీ :11,659

రాజస్థాన్ :6,227.

తెలుగు రాష్ట్రాలలో కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్: 2,605

తెలంగాణ: 1,699


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: