ఇండియాలో గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు, 103 మంది మృతి.!
Tuesday, May 5, 2020 07:21 AM News
దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3656 కొత్త కేసులు నమోదయ్యాయని , 103 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 1567, ఢిల్లీ లో 349, ఆంధ్రప్రదేశ్ లో 67, తెలంగాణాలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి, కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,437 కాగా మరణాల సంఖ్య 1,566 గా ఉంది. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని, కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు.
ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూదాము.
మహారాష్ట్ర :14,541
ఢిల్లీ : 4,849
తమిళనాడు : 3,350
తెలంగాణ :1,085
ఆంధ్రప్రదేశ్ :1,650
కర్ణాటక : 651
For All Tech Queries Please Click Here..!
Topics: