గుండెపోటుతో ప్రముఖ యువ హీరో మృతి.. షాక్‌లో సినీ పరిశ్రమ!

Saturday, March 28, 2020 11:15 AM Entertainment
గుండెపోటుతో ప్రముఖ యువ హీరో మృతి.. షాక్‌లో సినీ పరిశ్రమ!

తమిళ సినీరంగంలో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న ఓ యువ నటుడు గుండెపోటుతో మృతి చెందాడు. 36 ఏళ్ల సేతురామన్‌ గురువారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు చెన్నైలో తుదిశ్వాస విడిచాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవటంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. సేతురామన్‌ కేవలం నటుడు మాత్రమే కాదు స్కిన్‌ డాక్టర్‌ కూడా . చెన్నైలో ఆయన సొంతంగా జీ క్లినిక్‌ పేరుతో ఓ హాస్పిటల్‌ ను నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. తమిళ హాస్యనటుడు సంతానానికి సన్నిహితుడు కావటంతో ఆయన ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు సేతురామన్.

2013లో రిలీజ్‌ అయిన కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య సేతురామన్‌ తొలి చిత్రం. మణికందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంతానం, సేతు, పవర్‌ స్టార్ శ్రీనివాసన్‌, విశాఖ సింగ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. అనంతరం వాలిబా రాజా, సక్కా పోడు పోడు అండ్‌ 50/50 లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: